SRD: జహీరాబాద్ శివారులోని పస్తాపూర్లో యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్మశాన వాటిక చివర్లో కట్టెలతో కొట్టి చంపారు. మృతుడు జరా సంఘం మండలం గంగాపూర్కు చెందిన మహబూబ్(32)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పోలీసులు తెలిపారు.