TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ప్రధాని మోదీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు. రేపు ఢిల్లీలో ప్రధానిని రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులనూ కలవనున్నారు. కాగా, మిగితా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.