KMR: అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తాజాగా మంగళవారం ముఠాలోని మరొక ఇద్దరు సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేసి ఉత్తర్వులను నిందితులకు అందజేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.