MDK: నార్సింగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో పలు రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు గురించి ఆరా తీశారు. వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.