KNR: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా గంగాధర మండల ప్రజలకు SI వంశీకృష్ణ ఇవాళ పలు సూచనలు చేశారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత, శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు. ఎలక్షన్ కోడ్ సమయంలో చట్టాన్ని, శాంతిని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. ఎన్నికల వేళ వాగ్వాదాలు, గొడవలు, గుంపుల మధ్య ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.