ADB: గర్భిణులు, బాలింతలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండల వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. గాదిగూడ మండలంలో అడిషనల్ DMHO మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. రక్తహీనత గల మహిళలు రోజువారి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయ్యేలా చూడాలని సూచించారు.