AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రులు లోకేష్, అనిత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొంథా తుఫాన్ కారణంగా రూ.6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నివేదిక అందజేశారు. మొంథా తుఫాన్ వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. మొత్తం 3,109 గ్రామాలు తుఫాన్ వల్ల ప్రభావితమయ్యాయని చెప్పారు.