MDK: టేక్మాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింత రమేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ కాలనీ నుంచి రమేష్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్కు మంచి బలం చేకూరిందని వీరప్ప పేర్కొన్నారు.