పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన ఆగట్లేదు. ‘SIR’ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతూ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య సభ నడపడం సాధ్యం కాకపోవడంతో.. లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం నుంచి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉండటంతో సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి.