SRPT: చిలుకూరు మండల కేంద్రంలోని బేతవోలు సబస్టేషన్ పరిధిలో నేడు విద్యుత్కు అంతరాయం కల్గనుంది. పోలేనిగూడెం ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాస్ తెలిపారు.