NLG: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన పెద్దవూర, హాలియా, పులిమామిడి గ్రామాల్లో ప్రజలకు నిన్న సాయంత్రం ఎన్నికల నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.