KMR: సదాశివ నగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కామారెడ్డి జిల్లా నూతన మార్క్ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకొచ్చిన మక్కల తేమశాతం పరిశీలించిన తర్వాత, నాణ్యతా ప్రమాణాలను పాటించి తూకం వేయాలని కొనుగోలు కేంద్రం సిబ్బందికి సూచించారు.