బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB హోంగ్రౌండ్ చినస్వామి స్టేడియంపై సస్పెన్షన్ కొనసాగుతోంది. దీంతో పుణే స్టేడియాన్ని తాత్కాలికంగా తమ హోంగ్రౌండ్గా ఉపయోగించుకోవాలని RCB నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ని RCB సంప్రదించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇదే నిజమైతే చినస్వామిలో RCB మ్యాచ్ చూడాలనుకున్నవారికి నిరాశ తప్పదు.