ఢిల్లీలో పేలుడుకు కారణమైన i20 కారుకు పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిట్టచివరి సారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ దీన్ని కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన భారీ పేలుడులో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.