SRCL: ఉచిత న్యాయ సహాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని, సమస్యలను శాంతియుతంగా త్వరితంగా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో న్యాయ సేవల దినోత్సవం ను పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది.