BHNG: తమ భూముల్లో నుంచి కాల్వ తవ్వి ఉపాధిని దెబ్బతీయవద్దంటూ మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు చేపట్టనున్న బునాదిగాని కాల్వ తవ్వకం పనులు చేపట్టేందుకు భూసేకరణకు వచ్చిన అధికారులను పాటిమట్ల రైతులు మంగళవారం అడ్డుకున్నారు.