MLG: జిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామాలకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో ఈ గ్రామాలకు ఎన్నికలను నిర్వహించట్లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య నడుస్తున్న కోర్టు కేసు కారణంగా ఈ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించట్లేదని తెలుస్తోంది.