VSP: జీవీఎంసీ రైవాడ మంచినీటి సరఫరా పథకం ప్రధాన 1000 పీఎస్సీ పైపులైన్లో లీకేజీల మరమ్మత్తుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. లక్ష్మీనగర్, జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో పైపులైన్ మరమ్మతులు చేపట్టనున్నట్లు జీవీఎంసీ కమిషసర్ తెలిపారు.