NLR: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు అన్నారు. వెంకటాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. మార్చి 15 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టి శ్రద్ధగా చదవాలన్నారు.