KRNL: ఎమ్మిగనూరు మండలంలో రెవెన్యూ శాఖ ఉద్యోగులు రైతుల,ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదంటూ JC Dr. నవ్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడిమెట్ల గ్రామంలో రీసర్వేను పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో VROలు, సర్వేయర్లురెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? లేదా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించారు.