W.G: ప్రజల రక్త మాంసాలతో సంపద సృష్టిస్తారా అంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు కొనసాగించలేమని చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ అందిస్తానని చెప్పారని గుర్తు చేశారు.