VZM: విద్యార్థులకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చిన తనకు ఫోన్ చేయొచ్చని MLC ఇందుకూరు రఘురాజు విద్యార్థులకు తెలిపారు. గురువారం ఆయన ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, వసతి సౌకర్యాలు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో భేటీ అయ్యారు. పరీక్షలు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.