NRPT: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణీకారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నారాయణపేట పట్టణంలోని అశోక్ నగర్లో వార్డు సభను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల పేర్లను మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు కొత్త వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.