NGKL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సంక్షేమపథకాలు అర్హులైన అందరికీ లబ్ధి చేకూర్చుతామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. మంగళవారం గుడిపల్లిలో జరిగిన గ్రామసభలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.