HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో చిత్తారమ్మ తల్లిని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మూలమంత్ర జపము, దేవతహోమాలు, పూర్ణాహుతి పూజలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిత్తారమ్మ దేవి 50వ స్వర్ణోత్సవాల జాతరలో భక్తులు అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.