KDP: కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ విమర్శించారు. బద్వేలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంధనంపై అధిక పన్నులను తగ్గించాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.