మనలో చాలామంది కేక్ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగుతుంటారు. అయితే కేక్లో ఉండే మైదా, చక్కెర శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. దీనికి తోడు కూల్ డ్రింక్ కూడా తాగితే, అందులోని ‘లిక్విడ్ షుగర్’ రక్తంలో చక్కెర శాతాన్ని భారీగా పెంచుతుంది. దీంతో జీర్ణక్రియను మందగించడమే కాకుండా, విపరీతమైన కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. అలాగే అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.