NLR: చేజర్ల మండలం ఏటూరు సమీపంలో శనివారం ప్రమాదం జరిగింది. పొదలకూరు నుంచి ఏటూరు వెళ్తున్న స్కూటీని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న రమేశ్ (35), పెంచల స్వామి(41) తీవ్రంగా గాయపడ్డారు. రమేశ్ చేయి విరగగా, పెంచలస్వామికి కాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వారిని 108లో పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.